Cloud Burst: 12 మంది మృతి.. యాత్రను నిలిపేసిన అధికారులు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-14 09:55:14  IST  )

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.

Cloud Burst: 12 మంది మృతి.. యాత్రను నిలిపేసిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కిష్టానాడ్‌లో సంభవించిన ఈ వరదల కారణంగా 12 మంది వరకు మృతిచెందారు. మచైల్ యాత్ర(Machail Yatra)కు వెళ్లే దారిలో ఈ వరదలు సంభవించడం మూలంగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు మచైల్ యాత్రను నిలివేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆన్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక చర్యలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఆరా తీశారు. క్లౌడ్‌ బరస్ట్‌లో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకొనే ప్రమాదం ఉంది. అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. నష్టం అంచనా వేయడం.. వైద్య సౌకర్యాలు కూడా వేగంగా ఏర్పాటు చేస్తున్నారు. నా ఆఫీస్‌కు నిరంతరం అప్‌డేట్లు అందుతున్నాయి. అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము అని కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు.

Also Read..

ఉధృతంగా మూడు వాగులు.. 100కి పైగా గ్రామాలకు రాకపోకలు బంద్

Next Story